Dhanush, Sekhar Kammula: శేఖర్ కమ్ముల పాన్ ఇండియా సినిమాపై అప్డేట్!

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుంది. ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ తెలుగులో నటిస్తోన్న మొదటి సినిమా ఇదే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమా స్టోరీ ప్రకారం.. ఓ మిడిల్ ఏజ్డ్ హీరో రోల్ ఉందట. ఆ పాత్ర కోసం ఎవరిని ఎన్నుకుంటారనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాదాపు అరడజను పేర్లు పరిశీలనలో వున్నాయి. వీటిలో ఒకదాన్ని త్వరలో ఫైనల్ చేస్తారని సమాచారం. మరి దీనికోసం తెలుగు ఆర్టిస్ట్ ను ఎన్నుకుంటారో లేక వేరే భాష నటుడిని తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరోపక్క ధనుష్ బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘అత్రాంగి రే’ అనే సినిమాతో పాటు హాలీవుడ్ లో ‘ది గ్రే మ్యాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు తమిళంలో కార్తిక్ నరేన్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇవి పూర్తయిన తరువాత శేఖర్ కమ్ముల సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus