హీరోయిన్ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

  • May 1, 2017 / 06:46 AM IST

డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన మల్టీ నేషనల్ కంపెనీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ లపై కొన్ని సరదా సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. షూటింగ్ లోనే కాదు హీరో హీరోయిన్ల మధ్య నిజజీవితంలోనూ సరదా సంఘటన జరిగింది. షూటింగ్ గ్యాప్ లో పవన్ అను తో నీకు ఇష్టమైన వంటకం ఏది అని అడగగానే.. ఆమె అప్పం అని సమాధానం ఇచ్చింది. ఆ విషయాన్నీ మనసులో పెట్టుకున్న పవన్ నెక్స్ట్ రోజు ఆమెకి ఇష్టమైన అప్పం తో పాటు కొన్ని కేరళ వంటకాలను ఇచ్చారు. వాటిని చూసి అను షాక్ తింది.

పవన్ తనపై చూపించిన అభిమానానికి ఆశ్చర్యపోయింది. అప్పం, కూరలను కడుపునిండా తింది.  పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న ఈ మూవీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది  కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus