తెలుగు సినిమా రంగంపై అనుపమ కామెంట్

  • February 24, 2018 / 09:35 AM IST

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తొలి చిత్రంతోనే తెలుగు వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ మూవీలో చిన్న రోల్ అయినప్పటికీ చక్కగా నటించి అభినందనలు అందుకుంది. తర్వాత నటించిన ‘ప్రేమమ్’, శతమానం భవతి హిట్ కావడంతో చేతినిండా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నానితో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తోంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌తోనూ కలిసి నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెను పరిశ్రమలోకి అడుగుపెట్టాక తొలిరోజులు ఎలా గడిచాయని అనుపమని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పింది. ”సినిమా రంగంలోకి రాకముందు నిజంగానే కొత్త ప్రదేశాలంటే కొంచెం బెరుగ్గానే ఉండేది.

ఎవరితోనూ అంత తొందరగా కలిసేదాన్ని కాదు. మరి సినిమానే మాయ చేసిందో లేక, ఇక్కడి మనుషుల తీరే అలాంటిదో తెలియదు కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమతో మమేకం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భాష కూడా నాకెవ్వరూ నేర్పించలేదు. తప్పా? ఒప్పా? అని ఆలోచించకుండా తెలుగు మాట్లాడటం మొదలుపెట్టా. ఒక్క భాషనే కాదు… సినిమాకి సంబంధించి నేనేదీ ప్రత్యేకంగా నేర్చుకున్నది లేదు” అని గలగలా చెప్పేసింది. అంతేకాదు ”మనసు నిండా సినిమాపై ఇష్టాన్ని నింపుకొని కెమెరా ముందుకొచ్చా. ఆ ఇష్టమే అన్నీ నేర్పించింది”అని అనుపమ వెల్లడించింది. తనకు నప్పే కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న అనుపమ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కావడానికి ఎంతో దూరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus