Arvind Swamy,Madhubala: ‘తలైవి’లో ఈ కాంబో సూపర్‌ ఉంటుందట!

  • July 14, 2021 / 03:37 PM IST

‘రోజా’ లాంటి హిట్‌ సినిమా ఇచ్చిన కపుల్‌ అరవింద్‌ స్వామి, మధుబాల. ఆ సినిమా ఆ జంటను చూసిన జనాలు… అందగాడు పక్కన అందగత్తె అంటే ఇలానే ఉంటుంది అంటూ తెగ మెచ్చుకున్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఇద్దరూ మళ్లీ కలసి నటించింది లేదు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు ఇద్దరూ కలసి నటిస్తున్నారు. అందులోనూ మామూలు కథతో కాదు. జనాలకు పెద్దగా తెలియని విశేషాలతోనట. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ‘తలైవి’ అనే సినిమా రూపొందిన విషయంత తెలిసిందే.

త్వరలో ఈ సినిమా విడుదల గురించి అధికారిక సమాచారం బయటకు రావొచ్చు. ఆ విషయం పక్కనపెడితే ఆ సినిమాలో అరవింద్‌ స్వామి… ఎంజీఆర్‌గా కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన లుక్‌ కూడా బయటికొచ్చింది. ఈ సినిమా ఎంజీఆర్‌ భార్యగా మధుబాల నటిస్తున్నారని సమాచారం. దీంతో ‘రోజా’ జోడీని సుమారు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘తలైవి’తో చూడొచ్చన్నమాట. ఎంజీఆర్‌, జయలలిత మధ్య ఉన్న అనుబంధం, బంధం గురించి ఈ సినిమాలో చూపిస్తారనే విషయం మనకు తెలిసిందే.

అయితే ఎంజీఆర్‌ తన భార్యను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ‘తలైవి’లో అవన్నీ… చూపిస్తారని తెలుస్తోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus