బిగ్ బాస్ 4: మనుషుల టీంకు మరో ఝలక్!

  • September 24, 2020 / 12:06 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఎవరినీ నమ్మలేం. గెలుపు కోసం ఎంతన్నా చేస్తారు. నిన్న దివిని కిడ్నాప్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడం దానికి ఉదాహరణ. అయితే అది సీరియస్ టాపిక్. ఎవరిది కరక్ట్… ఎవరు కరక్ట్ అనేది వేరే విషయం. ఈ రోజు అవినాష్ తెలివిగా ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అసలు సిసలు స్మార్ట్ గేమ్ అంటే ఇది అని చూపించాడు.

అమ్మ రాజశేఖర్ మాస్టర్.. ఇంకొందరు బయట టేబుల్ పై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ లోగా అక్కడికి వచ్చిన అవినాష్ మాటల్లో అమ్మ రాజశేఖర్ నుంచి ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు. విషయం గమనించే లోగా ముక్కు రోబోకి ఛార్జ్ అయిపోయింది. తరవాత ‘మాస్టర్ మంచి ప్లేయర్ అనుకున్నా’ అంటూ మెహబూబ్ సెటైర్ కూడా వేశాడు. ఏదైతే ఏముంది మరోసారి రోబో టీం … మనుషుల టీం ని బోల్తా కొట్టించింది. ఆఖరిలో సోహైల్ ఫ్రస్టేషన్ చూస్తుంటే ఈ రోజు ఇలాంటివి చాలా జరిగినట్లు ఉన్నాయి.


‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus