అసలు పోయి…కొసరు మిగిలె…!!!

  • January 9, 2017 / 06:17 AM IST

మెగాస్టార్ రీ ఎంట్రీ….దాదాపుగా 10ఏళ్ల తరువాత మళ్లీ చిరు తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు…అయితే అదే క్రమంలో సినిమాకు హైప్ తెప్పించేందుకు నిర్మాత రామ్‌చరణ్ చాలా ప్లాన్స్ వేశాడు….ఇక ఆ ప్లాన్స్ అన్ని సక్సెస్ అయ్యాయి అన్ని క్రమంలో ఈ పీ-రిలీజ్ ఫంక్షన్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయినట్లే కనిపించింది కానీ..కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అసలు పోయి కొసరు మిగిలినట్లే అనిపిస్తుంది…విషయంలోకి వెళితే…సినిమా ప్రీరిలీజ్ కి పవన్ కల్యాణ్ వస్తాడు అని అందరూ ఊహించారు కానీ…అనుకోకుండా పవన్ తన ట్వీట్ తో రావడంలేదు అని శుభాకాంక్షలు తెలిపి ముగించాడు…ఇక ఆ విషయం పక్కన పెడితే….ఈ ప్రోగ్రామ్ లో నాగబాబు చేసిన సంచలన వ్యాఖలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.

చరణ్ మీద.. చిరు మీద విమర్శలు చేశారంటూ మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేయటం.. ఛండాలంగా తిట్టేయటంతో.. గ్రాండ్ గా జరగాల్సిన ఫంక్షన్ మరో రూట్ లోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. సినిమా ఫంక్షన్ పూర్తి అయ్యాక.. సినిమా ట్రైలర్ గురించి.. సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన వాళ్ళు…నాగబాబు చేసిన విమర్శలు.. దానికి యండమూరి ఇచ్చిన కూల్ రిటార్ట్ ఒక ఎత్తు అయితే.. ఎడాపెడా వాయించేలా వర్మ చేసిన ట్వీట్లతో.. అందరూ ఆ విషయాన్ని మరింత భారీగా కవర్ చేసిన పరిస్థితి. దీంతో సొమ్ము పోయి దుమ్ము పట్టే అన్నట్లు తయారయింది ఈ పరిస్థితి. మొత్తంగా సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ….ఈ కాంట్రొవర్సీ మాత్రం చాలా ఇబ్బందులకు దారి తీసెలాగా కనిపిస్తుంది…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus