అభిమానుల మాటకే ఓటు వేసిన బాలయ్య

  • June 8, 2017 / 06:25 AM IST

టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఎన్ని ప్రగల్భాలు పలికినా నందమూరి వంసానికి ఉన్న క్రేజ్ కానీ, వాళ్ళ తీరు కానీ, ఇంకా చెప్పాలి అంటే సినిమాల విషయంలో వారికి ఉన్న గట్స్ కానీ బహుశా మరెవ్వరికీ లేవు అనే చెప్పాలి…ఎందుకంటే తలపండిన హీరోలు కూడా తమ ప్రతిష్టాత్మక సినిమాలను ఫక్తు కమర్షియల్ సినిమాలుగా మలచుకుని హిట్ అనిపించుకుంటున్న తరుణంలో కూడా తన 100వ సినిమాలో చరిత్రలో మిగిలిపోవాలి అన్న ఆలోచనతో పక్కా తెలుగుజాతి పౌరుషాన్ని, తెలుగు వెలుగుని అందరికీ మరొక్కసారి రుచి చూపించే క్రమంలో “గౌతమీ పుత్ర శాతకర్ణి” అంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు బాలయ్య. ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న ఫక్తు కమర్షియల్ కాలంలో, ఇలాంటి సినిమా తీసి దాదాపుగా 73కోట్ల వసూళ్లు సాధించడం ఒక్క బాలయ్యకే సొంతం. అయితే వెంటనే బాలయ్య తన 101వ సినిమాగా పూరీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా టైటిల్ విషయంలో కాస్త కన్ఫ్యూషన్ తలెత్తడంతో ఫైనల్ గా అభిమానుల మాటకే ఓటేశాడు మన ముద్దుల బాలయ్య.

అసలు విషయం ఏంటి అంటే బాలకృష్ణ డాన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం ముందు తేడా సింగ్ అని టైటిల్ పెట్టాలని ఆలోచించారు. పూరి మార్క్ వెరైటీ టైటిల్ అని అనుకుంటారనుకుంటే అది ఫ్యాన్స్ కు కోపం తెప్పించేసింది. తేడా సింగ్ మీద తేడా రియాక్షన్ రావడంతో ఇప్పుడు ఆ సినిమాకు జై బాలయ్య టైటిల్ పెట్టబోతున్నారట. టైటిల్ గా ఉస్తాద్, తేడా సింగ్ పరిశీలించి అవేమి కాకుండా జై బాలయ్యకే ఓటేశారని తెలుస్తుంది. మొత్తానికి ఫ్యాన్స్ మాటే నెగ్గేలా చేశాడు బాలయ్య బాబు. సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే అభిమానులే శ్రీరామరక్ష అనే బాలయ్య మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా మరో సారి తాను అభిమానులకు అభిమానినే అని నిరూపించుకునాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus