అల్లుడు అదుర్స్… సాయి శ్రీనివాస్ కి మిలింది ఏమీ లేదా?

Ad not loaded.

అల్లుడు అదుర్స్..సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఇమాన్యుల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటంచారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది.కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి.అయితే ఈ చిత్రానికి పాపం మన సాయి శ్రీనివాస్ కు ఎటువంటి పారితోషికం తీసుకోలేదట. అవును ఫ్రీగా చేశాడట.

నిజానికి ఈ చిత్రానికి 32కోట్ల బడ్జెట్ అయ్యింది.వీటిలో షూటింగ్ మొదలైన టైంలోనే జెమినీ టీవీ(సన్ నెక్స్ట్) వారికి శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను 8 కోట్లకు అమ్మేసారట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఏకంగా 14కోట్లకు అమ్మారట. ఇక ఆడియో రైట్స్ ను ఆదిత్య వారికి 1 కోటికి అమ్మినట్టు తెలుస్తుంది. దీంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రం 23కోట్ల రికవరీ సాధించింది. ఇదంతా సాయి శ్రీనివాస్ కు ఉన్న మార్కెట్ కారణంగానే వచ్చిన అమౌంట్.

థియేటర్ల పరంగా కూడా ఈ చిత్రం కలెక్షన్లు పర్వాలేదు అనిపించాయి. టోటల్ గా 33 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది ఈ చిత్రం. అయితే 25 కోట్లకు అనుకున్న బడ్జెట్ 32 కోట్లు అయిపోవడంతో పారితోషికం వద్దన్నాడట.ఒకవేళ లాభాలు వస్తే వాటా ఇవ్వమని చెప్పాడట. కానీ అది సాధ్యం కాకపోవడంతో సాయి కి ఏమీ మిగల్లేదు అని తెలుస్తుంది.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus