బాలీవుడ్ సినిమాను ఆదర్శంగా తీసుకొని వరుస మోసాలు

  • November 22, 2018 / 03:09 AM IST

సాధారణంగా సినిమాలనేవి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంటాయి. కానీ.. చాలా అరుదుగా సినిమాలను ఆదర్శంగా తీసుకొని నేరాలు జరుగుతుంటాయి. రీసెంట్ గా ఒక కేడీ లేడీ వరుసబెట్టి ఓ ఆరుగురుని పెళ్లాడడమే కాక.. పెళ్ళైన మరుసటి రోజే ఇంట్లోని బంగారంతో ఉడాయించిందట. అలా ఆరుగుర్ని మోసం చేసిన తర్వాత మరొకడ్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తుండగా దొరికింది. దాంతో ఆమెపై 420 కేసు పెట్టి జైల్లో పెట్టారు.

సరిగ్గా ఇలాంటి కథతోనే బాలీవుడ్ లో పరిణీతి చోప్రా కథానాయికగా “దావత్ ఎ షాదీ” అనే సినిమా వచ్చింది. మరి ఈ సినిమా చూసి ఆ కేడీ లేడీ ఈ నేరాల్ని ప్లాన్ చేసిందో లేక ఆవిడ చేసిన నేరాలు ఆ సినిమాకి సింక్ అయ్యాయో తెలియదు కానీ.. ఈ వార్త చదివినవాళ్లందరికీ ఆ సినిమా గుర్తుకొస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus