స్టార్ హీరోల పై బోయపాటి షాకింగ్ కామెంట్స్

  • September 10, 2019 / 05:05 PM IST

ఊర మాస్ సినిమాలకి ‘కేర్ ఆఫ్ అడ్రెస్’ అంటే బోయపాటి శ్రీను పేరే చెప్తారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈయన ఏ సినిమా మొదలు పెట్టలేదు. ఈఏడాది ‘వినయ విధేయ రామ’ చిత్రంతో పెద్ద డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. అంతేనా ఆ చిత్రం హీరో రాంచరణ్ కు ‘రంగస్థలం’ చిత్రంతో వచ్చిన మంచి పేరుని మొత్తం ‘వినయ విధేయ రామా’ చిత్రంతో చెడగొట్టాడు. దీంతో ఈ డైరెక్టర్ పేరు చెప్తే స్టార్ హీరోలే కాదు మీడియం హీరోలు కూడా భయపడుతున్నారు. ఆఖరికి బాలయ్య బాబు కూడా బోయపాటికి ఛాన్స్ ఇవ్వలేదు. ‘ఎన్టీఆర్’ తరువాత బోయపాటిని కాదని కె.ఎస్.రవికుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న బోయపాటి.. తెలిసిన వాళ్ళ సినిమా ఈవెంట్లకు హాజరవుతున్నాడు.

ఇటీవల ‘పహిల్వాన్’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు బోయపాటి శ్రీను. ఈ వేడుకలో బోయపాటి మాట్లాడుతూ… “ఇప్పుడు హీరోలు మారిపోయారు. కథలు డిమాండ్ చేస్తే మన హీరోలు ఎలా కావాలంటే అలా మారిపోతున్నారు. రాంచరణ్ ‘రంగస్థలం’ కోసం.. బన్నీ ‘సరైనోడు’ కోసం.. ప్రభాస్ ‘సాహో’ ‘బాహుబలి’ కోసం చాలా మారిపోయారు. అంతెందుకు బాలయ్య కూడా ఇప్పుడు తాను చేస్తున్న సినిమా కోసం 11 కేజీలు తగ్గిపోయాడు. సుదీప్ కూడా తన సినిమాల కోసం మారిపోతున్నాడు.. భాషలతో పని లేకుండా కేవలం కథలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ‘ఒక్క డిజాస్టర్ పడగానే బోయపాటి ఆటిట్యూడ్ బాగా తగ్గిందే అంటూ’ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus