Chandra Mohan: ఒకటో తారీకు వస్తే చంద్రమోహన్ ఇంటి ముందు క్యూ కట్టేవారా?

  • November 13, 2023 / 01:08 PM IST

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు చంద్రమోహన్ ఒకరు. ఇక ఈయన ఇండస్ట్రీలో దాదాపు అయిదు దశాబ్దాల పాటు కొనసాగుతూ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈయన నేడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విధంగా చంద్రమోహన్ మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా గత ఇంటర్వ్యూలలో చంద్రమోహన్ పాల్గొని చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో అయిదు దశాబ్దాల పాటు కొనసాగినటువంటి చంద్రమోహన్ భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పెట్టారు. చెన్నైలో 15 ఎకరాల ద్రాక్షతోట కొనుగోలు చేశారు. హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆరు ఎకరాల పొలం కొన్నారు. ఈ విధంగా భారీ స్థాయిలో భూములను కొనుగోలు చేసినటువంటి చంద్రమోహన్ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారు.

అయితే వీటిని పట్టించుకోలేకుండా ఉన్నప్పుడు మన వద్ద ఎందుకు అన్న ఉద్దేశంతోనే ఈ ఆస్తులు అన్నింటిని అమ్మేశారట. తాను భూమి అమ్ముతున్న సమయంలో శోభన్ బాబు అమ్మద్దని చెప్పినప్పటికీ తన మాట వినకుండా అమ్మేసారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. విధంగా ఆరోజు భూములన్నింటినీ అమ్మి తాను చాలా నష్టపోయానని తెలిపారు. ఆ భూములు విలువ దాదాపు ఇప్పుడు 100 కోట్లకు పైగా విలువ చేస్తుందని ఈయన కన్నీరు పెట్టుకున్నారు.

సినీ కెరియర్ లో సంపాదించిన దాని కన్నా పోగొట్టుకున్నది ఎక్కువగా ఉందని (Chandra Mohan) చంద్రమోహన్ చెప్పగా తన భార్య జలంధర మాత్రం ఈయన చేతుల మీదుగా ఎవరైనా కొంత డబ్బు తీసుకొని వ్యాపారం ప్రారంభిస్తే మాత్రం మంచి సక్సెస్ అవుతారని తెలిపారు. అందుకే ప్రతి ఏడాది జనవరి ఒకటో తారీకు మా ఇంటి ముందు చాలా మంది క్యూ ఉండేవారని వారంతా ఆయనతో సహాయం అందుకొని వ్యాపారాలను ప్రారంభించుకొనేవారు అంటూ తెలిపారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus