‘ఎన్టీఆర్’ ఆడియో వేడుక ప్లేస్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

  • December 16, 2018 / 02:46 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరెక్షన్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రంతో వస్తున్న సంగతి తెలిసిందే. దివంగత నేత, మహానటుడు ‘ఎన్టీఆర్’ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ వారాహి సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి చాలా అద్భుతంగా ఎన్టీఆర్ జీవితాన్ని వెండి తేరా పై ఆవిష్కరించాడని సమాచారం.

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం నుండీ విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్ర మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ ను జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తుండగా రెండో పార్ట్ ‘మహా నాయకుడు’ ను జనవరి 25న విడుదల కానుంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ ను ఆడియోను డిసెంబర్ 21న ఎన్టీఆర్ సొంత ఊరు అయిన నిమ్మకూరులో నిర్వహించబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus