రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాతే చరణ్ కొత్త లుక్

  • February 28, 2018 / 01:09 PM IST

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేస్తున్న రంగస్థలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మార్చి 30 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత చెర్రీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలయింది. నాన్ స్టాప్ గా మొదటి షెడ్యూల్ రాజస్థాన్ లో జరుగుతోంది. అయితే ఇందులో చరణ్ పాల్గొనడం లేదు. అతను లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. చరణ్ షూటింగ్ లో పాల్గొనడానికి గడ్డమే అడ్డమయింది. మరి తీసేయొచ్చుగా అంటే.. అందుకో రీజనుంది. అదే రంగస్థలం ప్రీ లీజ్ ఈవెంట్.

ఈ వేడుకను మార్చి 18 న వైజాక్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమంలో చరణ్ చిట్టిబాబు లుక్ లోనే ఉండాలి. అందుకోసమే ఈ లుక్ నే కంటిన్యూ చేస్తున్నారు. ఆ ఈవెంట్ తర్వాత కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. రాజ వంశస్థుడిగా రామ్ చరణ్ నటించనున్న ఇందులో అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ హీరో), నవీన్‌ చంద్ర(అందాల రాక్షసి), ఆర్యన్ రాజేష్ నటించనున్నారు. వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus