అభిమానులను నిరాశపరిచిన మెగాస్టార్ చిరంజీవి

  • December 17, 2016 / 01:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా షూటింగ్ ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై ఆకట్టుకుంది. ఈ నెల 25 న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో అత్యంత గ్రాండ్ గా ఈ చిత్ర ఆడియో నిర్వహించాలని నిర్మాత రామ్ చరణ్ తేజ్ అనుకున్నారు. కానీ అక్కడ అనుమతి దొరక్కపోవడంతో ఆలోచనలో పడ్డారు.

వేరే వేదికను ప్రకటిస్తారని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి చెర్రీ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆడియో వేడుకను నిర్వహించడం లేదని వెల్లడించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో ఒకదాన్ని రేపు రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చిరుని చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది. అయితే జనవరి మొదటివారంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన  ఖైదీ నంబర్ 150 భారీ అంచనాలతో సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus