‘ఉప్పెన’ స్టేజీ మీద చిరు క్లారిటీ!

  • February 7, 2021 / 11:27 AM IST

సినిమాల ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లలో చిరంజీవి వస్తే ఆ సినిమాకు కచ్చితంగా హైప్‌ క్రియేట్‌ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు కాస్త స్టోరీ లీక్‌ అవుతుంది, మీమ్స్‌ కూడా పుట్టుకొస్తాయి. మొన్నామధ్య ‘ఓ పిట్టకథ’ సినిమా ఈవెంట్‌లో ‘ఆచార్య’ అంటూ తన సినిమా టైటిల్‌ ప్రకటించేశారు. అయితే అంతకుముందు చాలా వేడుకల్లో సినిమా మెయిన్‌ పాయింట్‌నే చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఇటీవల ఈ విషయంలో మీమ్స్‌ పెరిగిపోవడంతో చిరు చాలా కంట్రోల్‌గా ఉంటున్నాడు. అంతేకాదు తన మీద తాను సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకుంటూ కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. తాజాగా ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ అదే చేశాడు.

వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ ఈవెంట్‌లో చిరు చాలా కంట్రోల్డ్‌గా మాట్లాడాడు. ‘నాకు మైక్‌ ఇస్తే కథ చెప్పేస్తానేమో అని అనుకుంటున్నారు… కానీ చెప్పను’ అంటూ తన మీద తాను ట్రోల్‌ చేసుకొని నవ్వించాడు. మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో పాయింట్‌ వరకు వచ్చి, తనను తాను తమాయించుకున్నాడు. ఈ క్రమంలో అందరిలో నవ్వులు పూయించాడు చిరు. అలా అని ఏదో కొత్త విషయం ( చెప్పకుండా చిరంజీవి ఏదైనా కార్యక్రమం ముగించేయడం ఎప్పుడైనా చూశామా? లేదు కదా. అందుకే ఈ వేదిక మీద కూడా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

యంగ్‌ డైరెక్టర్‌ బాబీ డైరక్షన్‌ చిరంజీవి ఓ సినిమా చేస్తాడని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని చిరంజీవి కూడా చాలాసార్లు చెప్పారు. అయితే నిర్మాత ఎవరు అనే విషయం స్పష్టంగా ఎప్పుడూ చెప్పింది లేదు. దీంతో ఏదో మూల ఉన్న చిన్న అనుమానం కూడా నిన్న ‘ఉప్పెన’ స్టేజీ మీద క్లియర్‌ అయిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో సినిమా ఉంటుంది అంటూ ప్రకటించేశాడు చిరు. అంతేకాదు ‘నాతో సినిమా తీస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ మైత్రీ టీమ్‌ థ్యాంక్స్‌ కూడా చెప్పాడు. ఇక మెహర్‌ రమేష్‌ సినిమా విషయమే బ్యాలెన్స్‌.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus