‘ఆచార్య’ సెట్లో ‘గ్యాంగ్ లీడర్’ బ్రదర్స్ సందడి..మేటర్ ఏంటి?

  • January 25, 2021 / 03:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా విజయ బాపినీడు డైరెక్షన్లో తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రాన్ని అంత తేలికగా ఎవ్వరూ మరిచిపోలేరు. ‘చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో.. రఫాడించేస్తాను ఏమనుకున్నావో’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇప్పటికీ బుల్లితెర పై అలరిస్తూనే ఉంది. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. ముగ్గురు అన్నదమ్ముల కథ ఇది.

వీరిలో పెద్దన్నయ్యగా మురళీ మోహన్ నటిస్తే, చిన్న అన్నయ్యగా శరత్ కుమార్ నటించాడు.. ఇక వీరి తమ్ముడిగా చిరంజీవి నటించడం విశేషం.అయితే ఈ ముగ్గురు బ్రదర్స్ 30ఏళ్ళ తరువాత ఒకేసారి అనుకోకుండా కలిశారు. మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సెట్లో ఈ ‘గ్యాంగ్ లీడర్’ బ్రదర్స్ కలిశారు. అలా అని మురళి మోహన్, శరత్ కుమార్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారా? అనే అనుమానం మీకు రావచ్చు. కానీ విషయం అది కాదు..

వీళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకోకుండా కలిశారు. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంటే, శరత్ మణిరత్నం సినిమాలో, మురళి మోహన్ ‘ఆర్కా మీడియా’ వారు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ 3 సినిమాల షూటింగులు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి.షూటింగ్ గ్యాప్ లో ఈ ముగ్గురు కలిసి ఫోటో తీసుకున్నారు అంతే..! ఏది ఏమైనా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Most Recommended Video


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus