మారుతి, సాయిధరమ్ తేజ్ కాంబో సినిమాలో భారీ మార్పులు

  • May 29, 2019 / 01:18 PM IST

మొదట్లో సాయిధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ చూసినవాళ్ళందరూ చరణ్ తర్వాతి స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు మెగా అభిమానులు. ముఖ్యంగా.. సాయిధరమ్ తేజ్ మ్యానరిజమ్స్ విషయంలో అచ్చుగుద్దినట్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా ఉండడంతో మెగా అభిమానుల ఆశలన్నీ తేజ్ పైనే ఉండేవి. కానీ విచిత్రంగా “సుప్రీమ్” తర్వాత పాపం తేజ్ ఒక్కసారిగా వరుస ఫ్లాపులతో సైలెంట్ అయిపోయాడు. దాదాపు ఆరు ఫ్లాపుల తర్వాత వచ్చిన యావరేజ్ హిట్ “చిత్రలహరి” అనంతరం మనోడు మళ్ళీ గాడిలో పడడం కోసం మారుతితో సినిమా చేస్తున్నాడు.

యువీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర కథాంశాన్ని ఇటీవల మారుతి మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట. సాయిధరమ్ కెరీర్ కి చాలా కీలకమైన ఈ సినిమా కథలో చిరంజీవి చాలా మార్పులు చెప్పారని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రంలో కథానాయికగా “నేల టికెట్టు” ఫేమ్ మాళవిక శర్మను కథానాయికగా ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా సెట్స్ కు ఎప్పుడు వెళుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus