NTR, Viswanath: ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్య జరిగిన గొడవ కారణంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా?

  • February 4, 2023 / 08:13 PM IST

లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఫిబ్రవరి 2వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మరణించిన తర్వాత ఎంతోమంది విశ్వనాధ్ గారితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశ్వనాథ్ గారికి ఎన్టీఆర్ కి మధ్య జరిగిన గొడవ కారణంగా వీరిద్దరి మధ్య 14 సంవత్సరాల పాటు మాటలు లేవని తెలుస్తోంది.

ఈ విధంగా ఎన్టీఆర్ విశ్వనాథ్ గారి మధ్య గొడవకు గల కారణం ఏంటి ఎందుకు మాట్లాడుకోలేదు అనే విషయానికి వస్తే కాలేజీ చదివే రోజులలోనే ఎన్టీఆర్ విశ్వనాధ్ గారికి సీనియర్.అలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి పరిచయం ఉంది ఎన్టీఆర్ చదువు పూర్తి అయిన తర్వాత సినిమాలలోకి వచ్చారు. విశ్వనాథ్ గారు కూడా చదువు పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం చిన్ననాటి స్నేహితులు.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కి విశ్వనాథ్ గారికి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ సన్ గ్లాసెస్ పెట్టుకొని లొకేషన్ లోకి వచ్చారట అయితే అది సెంటిమెంట్ సీన్ కావడంతో సన్ గ్లాసెస్ బాగుండవని విశ్వనాథ్ చెప్పినప్పటికీ ఎన్టీఆర్ అదే సన్ గ్లాసెస్ తో నటించారట. ఇలా ఈ సన్నివేశం షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.

ఈ సంఘటన విషయంలో ఎన్టీఆర్ విశ్వనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాగే డబ్బుకు లోకం దాసోహం అనే సినిమాకు ముందుగా విశ్వనాథ్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ఎన్టీఆర్ ఆయనని తొలగించి యోగానంద్ ను డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇలా ఈ గొడవల కారణంగా వీరిద్దరి మధ్య 14 సంవత్సరాల పాటు మాటలు లేవని అయితే బాలకృష్ణ హీరోగా నటించిన జనని జన్మభూమి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మాట్లాడుకున్నారని తెలుస్తోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus