మొన్న రాజమౌళి నిన్న దాసరి ఇప్పుడు ప్రభుదేవా!

  • June 8, 2016 / 02:28 PM IST

ఇండస్ట్రీలో ఉండే ప్రతి దర్శకుడికి ఓ కలల ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. దాన్ని నెరవేర్చుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తారు. దర్శకరత్న దాసరి నారాయణరావు మాహాభారతాన్ని ఐదు భాగాలుగా తీయాలనేది నా కలని, అదే నా జీవితంలో ఆఖరి సినిమా అని కూడా అనౌన్సు చేశారు.

అలానే రాజమౌళి కూడా తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పారు. ఖచ్చితంగా సినిమా చేయడం మాత్రం ఖాయమని చెప్పాడు. బాలీవుడ్ లో కొందరు దర్శకులు కూడా మహాభారతాన్ని సినిమాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరి మధ్యలో ఇప్పుడు కొత్తగా ప్ర‌భుదేవా కూడా మహాభారతాన్ని సినిమాగా చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

మ‌హాభార‌తం చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తీయాల‌ని క‌ల‌లుకంటున్నాడ‌ట‌ ప్రభుదేవా. అదే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని బహిరంగంగానే చెప్పాడు. మరి వీరందరిలో ముందుగా సినిమా చేసేది ఎవరో చూడాలి. ఏదేమైనా మన పురాణాలను ప్రపంచ స్థాయిలో చెప్పాలనుకోవడం మంచి విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus