Devi Sri Prasad: పుష్ప 2 డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న దేవిశ్రీ?

  • November 8, 2023 / 11:52 AM IST

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఫిదా అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ పాటలు మ్యూజిక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అంతగా తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. ఇలా ఈ సినిమా మ్యూజిక్ ఏంతో మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ సినిమాకి మరింత ఫోకస్ పెట్టి మ్యూజిక్ కంపోస్ట్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటలన్నీ కూడా పూర్తి అయ్యాయని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పారు.

ఇలా పుష్ప సీక్వెల్ సినిమా కోసం అభిమానులు కూడా భారీ అంచనాలతో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం వార్తలు వారాలు అవుతున్నాయి. పుష్ప సినిమా కోసం నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్ సీక్వెల్ సినిమాకు తన రెమ్యూనరేషన్ డబుల్ చేశారని చెప్పాలి. ఈ సినిమా కోసం (Devi Sri Prasad) ఈయన దాదాపు 8 కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అలాగే కుమార్ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరగడమే కాకుండా ఈ సినిమా లాభంలో కూడా వాటా తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ తన రెమ్యూనరేషన్ కూడా డబ్బులు చేశారని జీఎస్టీ లను మినహాయించి ఈయన ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus