ఆ సూపర్ హిట్ రీమేక్ నుండీ తప్పుకున్న దేవి శ్రీ ప్రసాద్?

  • May 18, 2019 / 01:37 PM IST

వరుణ్ తేజ్ , హరీశ్ శంకర్ కాంబినేషన్లో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన తమిళ చిత్రం ‘జిగర్తాండ’ కు ఇది రీమేక్ అని తెలిసిన సంగతే. తమిళంలో బాబీసింహా చేసిన క్యారెక్టర్ నే వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రంలో చేస్తున్నాడు. .. ఇక మరో హీరో సిద్ధార్థ్ పాత్రలో అథర్వ నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా పూజా హెగ్దే ను అనుకున్నా.. ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో నిర్మాతలు వెనుకడుగేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ముందుగా దేవిశ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడుగా అనుకున్నారు. కానీ కారణం ఏంటనేది తెలీదు… ఈ ప్రాజెక్టు నుండీ దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్నాడట. ఈయన స్థానంలో మిక్కీ జె. మేయర్ ను తీసుకున్నారని సమాచారం. హరీష్ శంకర్.. సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రానికి కూడా మిక్కీ నే మ్యూజిక్ అందించాడు. అప్పుడు హరీష్ తో ఏర్పడిన అనుబంధం తోనే హరీష్ ఈ ప్రాజెక్టుకు మిక్కీ జె. మేయర్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఆగష్టు లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus