Dhanush, Aishwarya: వైరల్ అవుతున్న ధనుష్‌, ఐశ్వర్య ల లేటెస్ట్ ఫోటో..!

  • August 22, 2022 / 11:49 PM IST

కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్ గా 18 ఏళ్ళ పాటు కలిసున్న ధనుష్‌- ఐశ్వర్య లు ఈ ఏడాది ప్రారంభంలో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. మధ్యలో వీళ్ళు మళ్ళీ కలవబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది కానీ..అదంతా అసత్య ప్రచారమని వీళ్ళ టీం క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియా ఖాతాల్లో కూడా తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించిన ఐశ్వర్య తిరిగి రజనీకాంత్‌గా మార్చేసుకుంది. విడాకులు ప్రకటించిన తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసింది లేదు.

ధనుష్ స్టార్ హోటల్ లో ఉంటున్నాడు.రూ.200 కోట్లతో కొత్త ఇల్లు నిర్మించుకునే పనిలోనూ, అలాగే వరుస సినిమాలతోనూ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఓసారి తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు ధనుష్. అప్పుడు ఐశ్వర్య హాజరుకాలేదు. అయితే అనూహ్యంగా తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించారు. ధనుష్- ఐశ్వర్య ల పెద్ద కొడుకు చదువుతున్న యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు.

‘ఈ రోజు చాలా బాగా మొదలయ్యింది.! నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..’ అంటూ ఐశ్వర్య సోమవారం నాడు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టింది. ఈ ఫోటోలో ధనుష్‌, ఐశ్వర్య… తమ పిల్లలతో కలిసి కెమెరా వైపు నవ్వులు చిందిస్తూ కనిపించడం విశేషం. ఈ ఫోటో వెంటనే వైరల్ అయిపోయింది. ధనుష్ – ఐశ్వర్య అభిమానులు ‘వీరు మళ్లీ కలిసిపోయారా, ఏంటి? ‘ అంటూ ఆశ్చర్య పడుతూ కామెంట్లు పెడుతున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus