Dhanush: హీరోకి నచ్చకుండానే సినిమా రిలీజ్ చేస్తున్నారా..?

  • April 29, 2021 / 01:58 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగమే తంత్రం’ సినిమా ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. గతేడాది లాక్ డౌన్ మొదలైన తరువాత థియేటర్లు తెరుచుకుంటే సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. కొన్ని రోజులకు ‘జగమే తంత్రం’ను నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు నిర్మాత శశికాంత్. ఈ విషయంలో అప్పట్లో ధనుష్ అభిమానులు సీరియస్ అయ్యారు. థియేటర్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేశారు.

ఈ విషయంలో ధనుష్ మీద కూడా విమర్శలు చేశారు. దీంతో ఆయన స్పందించక తప్పలేదు. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలనేదే తన అభిమతమని.. అలానే జరగాలని కోరుకుందామని ఓ ట్వీట్ పెట్టాడు. దీంతో ధనుష్ కి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం ఇష్టం లేదని తేలిపోయింది. తాజాగా.. ‘జగమే తంత్రం’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. జూన్ 18న ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

దీని గురించి నిర్మాతతో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా ట్వీట్ వేశాడు. కానీ ధనుష్ మాత్రం ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. దర్శకనిర్మాతల ట్వీట్లను రీట్వీట్ కూడా చేయలేదు. దీన్ని బట్టి అతడు ‘జగమే తంత్రం’ టీమ్ తో టచ్ లో ఉండడం లేదని అర్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమా ఇటీవల విడుదలై యాభై శాతం ఆక్యుపెన్సీలో కూడా మంచి రిజల్ట్ ను సాధించింది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus