డిసెంబర్ తొలివారంలో ధృవ ఆడియో విజయోత్సవ సభ

  • November 21, 2016 / 01:38 PM IST

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ తేజ్  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ధృవ. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐపీఎస్ ఆఫీసర్ గా చెర్రీ కనిపిస్తున్న ఈ మూవీ నిన్న సెన్సార్ సభ్యుల వద్దకు వెళ్ళింది. ధృవ ను చూసి వారు ఎటువంటి కట్స్ చెప్పకుండా యుఎ సర్టిఫికెట్ ని ఇచ్చారు. ఇక థియేటర్లలోకి రావడానికి అన్ని పనులు పూర్తి అయినట్లే.

ముందుగా ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 2న విడుదల కావాలి. కానీ పెద్ద నోట్ల రద్దువల్ల విడుదల తేదీని వారం పొడిగించి డిసెంబర్ 9కి మార్చారు. తమిళంలో విజయవంతమైన “తని ఒరువన్” ఫిల్మ్  ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అరవింద్‌స్వామి విలన్‌గా కనిపిస్తారు. ఇటీవలే విడుదలైన ధృవ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ ఆడియో సాధించిన విజయాన్ని అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ ఓ వేడుకగా జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus