“సభకు నమస్కారం” పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

  • August 3, 2018 / 06:18 AM IST

“సభకు నమస్కారం” టైటిల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని దిల్ రాజు బ్యానర్లో నాని చేస్తున్నారని మొదట టాక్ వచ్చింది. అయితే నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత గౌతమ్ తిన్నమూరి దర్శకత్వంలో “జెర్సీ” అనే చిత్రం చేయనున్నారు. అప్పటి వరకు ఆగలేక దిల్ రాజు అల్లు అర్జున్ కి కథ వినిపించడం.. ఎటువంటి మార్పులు చూసించకుండా బన్నీ ఒకే చెప్పడం జరిగిపోయాయని వార్త నిన్న వైరల్ అయింది. ఈ వార్తలపై దిల్ రాజు స్పందించారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పారు.

ఈరోజు తన బ్యానర్ లో నిర్మించిన “శ్రీనివాస కళ్యాణం” ట్రైలర్ ని దిల్ రాజు మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ “సభకు నమస్కారం” పై క్లారిటీ ఇచ్చారు. “అల్లు అర్జున్ తో సభకు నమస్కారం అనే చిత్రాన్ని చేయడంలేదు. ప్రస్తుతం నా బ్యానేర్ లో ‘శ్రీనివాసకళ్యాణం’తోపాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వ చిత్రాలను మాత్రమే నిర్మిస్తున్నాను” అని స్పష్టం చేశారు. దీంతో నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేయనున్న ప్రాజక్ట్ ఏమిటి? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus