హీరోయిన్ పై ఫైర్ అయిన దర్శకుడు..!

  • October 25, 2019 / 01:44 PM IST

ప్రముఖ మలయాళ దర్శకుడు వి.ఏ శ్రీకుమార్ మేనన్‌, నటి మంజు వారియర్ మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే.. మంజు వారియర్ దర్శకుడు శ్రీకుమార్ మేనన్‌ పై పోలీసు కేసు పెట్టింది. ‘శ్రీకుమార్ తన సోషల్ మీడియా ద్వారా తప్పుడు క్యాంపెయినింగ్ చేస్తూ.. నా పరువు తీస్తున్నాడని….. అంతేకాకుండా నా స్నేహితులను బెదిరిస్తున్నాడని… ఆయన నుండీ నాకు ప్రాణహాని ఉందని’.. మంజు వారియర్ కేరళ డీజీపీ లోకనాథ్ బెహెరా‌కు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆమె పోలీసులకు అందచేయడం జరిగింది. గతేడాది మంజు వారియర్.. శ్రీకుమార్ మేనన్‌ డైరెక్షన్లో అనేక ‘కళ్యాణ్ జ్యువెలరీ’ యాడ్స్‌ చేయడమే కాకుండా అతని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పుష్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్స్‌కు కూడా పలు ప్రకటనలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మెహన్‌లాల్‌ హీరోగా వచ్చిన ‘ఒడియన్‌’ చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి కూడా శ్రీకుమార్‌ మేననే డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ‘ఒడియన్’ ప్లాప్ అవ్వడానికి కూడా మంజునే బాధ్యురాలినని సినిమాకి సంబంధించిన పలు ప్రమోషనల్ ఇంటర్వూస్‌లో శ్రీకుమార్ చెప్పినట్లుగా ఉన్న ఆధారాలను సైతం మంజు కంప్లైంట్‌ లో పేర్కొంది. ఇక దీంతో కేసుని పోలీసులు విచారించడం మొదలు పెట్టారు.

ఇక ఇదే విషయం ఫై తాజాగా దర్శకుడు శ్రీకుమార్‌ సోషల్‌మీడియాలో స్పందించాడు. శ్రీకుమార్ స్పందిస్తూ.. ” మంజు.. నువ్వు ప్లాబ్లమ్స్ ల్లో ఉన్నప్పుడు నేను మాత్రమే నీకు సహాయం చేశానన్న విషయాన్ని మర్చిపోయావనుకుంట? నావల్లే నీకు అనేకమందితో పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు.? నువ్వు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు.? మీడియా ద్వారా నువ్వు నా మీద పెట్టిన కంప్లైంట్ గురించి తెలుసుకున్నాను. ఈ కేసు విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను. నాకు, మంజు వారియర్‌కు మాత్రమే తెలిసిన ఎన్నో నిజాలను ఈ విచారణలో బయటపెడతాను’ అంటూ శ్రీకుమార్‌ చెప్పుకొచ్చాడు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus