బాలయ్య పిలిచి మరీ అడిగితే కాదంటానా!

  • October 4, 2017 / 10:46 AM IST

దాదాపు 14 ఏళ్ల తర్వాత “నేనే రాజు నేనే మంత్రి”తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ తేజ ప్రస్తుతం అమెరికాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఆయన నెక్స్ట్ సినిమా కోసం నిర్మాతలు మాత్రం ఆయనింటి ముందు క్యూ కట్టారు. తనకు ఫ్లాప్స్ వచ్చినప్పుడు పట్టించుకోని నిర్మాతలను తాను ఇప్పుడు కనికరించేది లేదని తేల్చేసిన తేజకు స్వయంగా నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఫోన్ వచ్చిందట. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీయార్ జీవితం ఆధారంగా బాలయ్య టైటిల్ పాత్రలో నటించే చిత్రానికి దర్శకత్వం వహించమని బాలయ్య స్వయంగా తేజను అడిగారాట.

తాను ఎంతగానో అభిమానించే ఎన్టీయార్ బయోపిక్ కావడంతోపాటు.. ప్రెజంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుండడంతో “నేనే రాజు నేనే మంత్రి” లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం తాను తీయబోయే సినిమా ఇదైతేనే బాగుంటుందని భావించిన తేజ కూడా ఒకే చెప్పేశారని సమాచారం. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను నవంబర్ నుంచి మొదలెట్టి.. జనవరిలో సెట్స్ కు వెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికి బాలయ్య 102వ సినిమా విడుదలైపోతుంది కాబట్టి మూడు లేదా నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి జూన్ లేదా జూలై నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus