దువ్వాడ జగన్నాథం థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్న స్పైడర్ నిర్మాత

  • May 25, 2017 / 08:33 AM IST

సరైనోడు తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని కోలుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. తాజాగా డీజే సీడెడ్ ఏరియా థియేటర్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయింది. ప్రముఖ నిర్మాత ఎన్ వీ ప్రసాద్ 12 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం మహేష్ బాబు మూవీ స్పైడర్ మూవీని వంద కోట్లతో నిర్మిస్తున్నారు. అటువంటి వ్యక్తి డీజే ని కొనడంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

సీడెడ్ లో సరైనోడు మూవీ 18 కోట్లు వసూలు చేయడంతో డీజే 12 కోట్లు ఇవ్వడానికి ఎన్ వీ ప్రసాద్ వెనుకాడలేదని తెలిసింది. ఈ మూవీ సీడెడ్ లో తప్పకుండా 20 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  పతాకంపై  భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ లో బన్నీ సరసన ముకుంద ఫేమ్ పూజ హెగ్డే నటిస్తోంది. బన్నీ బ్రాహ్మణ యువకుడిగా నటించిన ఈ మూవీ జూన్ 23 న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus