Double ismart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగిపోయింది.. ఇదిగో సాక్ష్యం… మళ్లీ ఎప్పుడు?

  • April 23, 2024 / 03:37 PM IST

పూరి జగన్నాథ్‌కి (Puri Jagannadh) ఏదీ కలసి రావడం లేదు. దర్శకుడిగా చేసిన ‘లైగర్‌’ (Liger) సినిమా ఫలితం తేడా కొట్టిన తర్వాత నుండి ఇదే మాట అంటున్నారు. అలా అని ఆయన చేసిన సినిమాలన్నీ పోతున్నాయా అంటే కాదు అనే చెప్పాలి. అయితే పోయిన సినిమాల ఎఫెక్ట్‌ గట్టిగా పడుతోంది. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart) కూడా చాలా నెలలుగా ఇలాంటి ఇబ్బందే పడుతోంది అంటున్నారు. సినిమా షూటింగ్‌ మొత్తంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది అని కూడా అంటున్నారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. రామ్‌ (Ram) హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ నిలిపేశారు అని సమాచారం. అయితే సినిమా టీమ్‌ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ సినిమా అయితే ముందుకు వెళ్లడం లేదు. దీనికి ఉదాహరణ పూరి ఏదో వ్యాపకంలా పెట్టుకున్న పనే. అవును, ఆ పనిని ఆయన మళ్లీ స్టార్ట్‌ చేయడంతో సినిమా ఆగిపోయింది అని తేల్చేస్తున్నారు నెటిజన్లు.

కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో పూరి జగన్నాథ్‌ తన ఆలోచనల్ని, తనకు తెలిసిన ఆసక్తికర విషయాలను.. సమాజంలోని చర్చకు రావాల్సిన, వచ్చిన అంశాలను పూరి మ్యూజింగ్స్‌ పేరుతో యూట్యూబ్‌ వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన సినిమా పనులు మొదలవ్వగానే ఆపేశారు. మళ్లీ మధ్యలో గ్యాప్‌ వస్తే చేశారు. ఆ లెక్కన ఇప్పుడు ఆయనకు గ్యాప్‌ వచ్చింది కాబట్టే ఇప్పుడు మళ్లీ మ్యూజింగ్స్‌ చేస్తున్నారు అని అంటున్నారు నెటిజన్లు.

అయితే, బడ్జెట్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో.. సినిమా ఆగిపోయిందని, రెమ్యూనరేషన్‌ కాకుండా వసూళ్లలో షేర్‌ అనే కాన్సెప్ట్‌లో రామ్‌ ముందు రావడంతో సినిమా త్వరలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభించి.. మిగిలిన ప్యాచ్‌ వర్క్‌ను కంప్లీట్‌ చేస్తారట. ఈ లోపు పూరి నుండి మరికొన్ని మ్యూజింగ్స్‌ వస్తాయి అని చెబుతున్నారు. చూద్దాం పూరి హితబోధ ఇంకెన్నాళ్లు ఉంటుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus