ప్రముఖ రంగస్థల నటుడు శ్రీనివాస దీక్షితులు హఠాత్మరణం..!

  • February 19, 2019 / 12:50 PM IST

ప్రముఖ సినీ నటుడు దీవి శ్రీనివాస దీక్షితులు ఈరోజు అనారోగ్యంతో కన్నుమూసారు. ఎన్నో ‘మురారి’ ‘అతడు’ ‘అన్నవరం’ ‘దృశ్యం’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించి మెప్పించారాయన. ప్రముఖ రంగస్థల నటుడు, దర్సకుడు గా అలాగే ‘ఆల్ ఇండియా రేడియో’ లో నటుడిగా పలు నాటకాల్లో నటించారు శ్రీనివాస దీక్షితులు.

ఓ పక్క రంగస్థల నటుడిగా నటిస్తూనే రేపల్లెలో జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు శ్రీనివాస దీక్షితులు. ఆయన నటించిన ‘ఆగమనం’ సీరియల్‌కు నంది అవార్డు అందింది. 2001 లో కృష్ణ వంశీ డైరెక్షన్లో మహేష్ హీరోగా వచ్చిన ‘మురారి’ చిత్రం ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ ‘ఠాగూర్’ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. ఈయనకి ఒక కుమారుడు ఉన్నాడు . శ్రీనివాస దీక్షితులు చాలా మంచి వ్యక్తని.. శ్రీనివాస దీక్షితులు లాంటి గొప్పనటుడ్ని కోల్పోవడం.. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటని కొందరు సినీప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus