అభిమానులను నిరాశకు గురిచేసిన మహేష్ బాబు!

Advertisement

భరత్ అనే నేను విజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరిగింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ గోవాలో మొదలుకానుంది. నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో సాగనుంది. మరో 5 రోజులలో ఆగష్టు 9వ తేదీన  మహేష్ బాబు పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా ఈ వేడుకని చాలా ఘనంగా సెలిబ్రేట్ చేసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఆ రోజు కొత్త సినీమా టైటిల్ రివీల్ అవుతుందని అనుకున్నారు.

కానీ టైటిల్ ని రివీల్ చేయడం లేదని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇందుకు కారణం టైటిల్ విషయంలో మహేష్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  “రాజసం”,  “రైతుబిడ్డ” అనే టైటిల్స్ ని వంశీ సూచించినప్పటికీ మహేష్ కి అవి నచ్చలేదంట. అందుకే కొంత సమయం ఇచ్చి మంచి టైటిల్ ఆలోచించమని చెప్పారంటా. అందుకే టీజర్ ని రిలీజ్ చేయడాన్ని మహేష్ నిలిపివేసినట్లు సమాచారం.  ఇక అభిమానుల బాధ తగ్గించాలని రెండు పోస్టర్స్ ని విడుదల చేయనున్నట్టు తెలిసింది. టైటిల్, టీజర్ లేక అభిమానులు ఆ రెండు పోస్టర్స్ తోనే పుట్టిన రోజు వేడుకను నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus