అనసూయకు ఆగ్రహం తెప్పించిన నెటిజనులు!

  • June 16, 2018 / 06:14 AM IST

అడల్ట్ కామెడీ షో ద్వారా అత్యంత తక్కువ సమయంలోనే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్న అనసూయ.. తన నోటి దురుసు సమాధానాలతో అంతే స్థాయిలో యాంటీ అభిమానులను పోగేసుకుంది. కెరీర్ మొదట్లో పవన్ కళ్యాణ్ పక్కన సాంగ్ చేయనని పవన్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించిన ఈ భామ.. అల్లు అర్జున్ పై  చురకలు వేసి.. అతని అభిమానులతో విమర్శలకు గురైంది. మొన్నటి మొన్న ఓ అబ్బాయి ఫోన్ ని పగలగొట్టి నెటిజనులతో ఘోరంగా తిట్లు తింది. ఆ సమయంలో వారి కామెంట్స్ కి సమాధానం చెప్పలేక సోషల్ మీడియా నుంచి దూరమయింది. తర్వాత రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించి తనపై ఉన్న విమర్శలన్నిటినీ దూరం చేసుకుంది. అందులో ఆమె నటనకి ప్రతి ఒక్కరూ అభిమానులు అయిపోయారు.

దీంతో అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. పెళ్లిరోజు సందర్భంగా తన భర్తతో మాల్దీవ్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది. అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు అప్డేట్ ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ ల ప్రవాహంలో హాట్ డ్రస్ లో ఉన్న ఫోటో ని షేర్ చేసింది. దీంతో యాంటీ ఫ్యాన్స్ కి అవకాశమిచ్చింది. ఏంటీ ఆంటీ ఈ ఫోజులు.. అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ అనసూయకి కోపం తెప్పించాయి. యెవర్రా ఆంటీ.. నువ్వే అంకుల్ అంటూ విరుచుకుపడింది. అనసూయ రిప్లై ఇవ్వడం మొదలెట్టడంతో విమర్శలు పెరిగిపోయాయి. ఇలా అనసూయ.. యాంటీ ఫ్యాన్స్ మధ్య గొడవ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. మరి ఈ గొడవ చల్లారేది ఎప్పుడో?.. అనసూయే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus