ఆఖరి తెలుగు సినిమా ఛాన్స్ పోగుట్టుకున్న రకుల్..!

  • February 21, 2019 / 03:44 PM IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘పవర్’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘జై లవ కుశ’ వంటి చిత్రాలని డైరెక్ట్ చేసిన బాబీ(కె.ఎస్.రవీంద్ర) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి లో ప్రారంభమైంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొదట ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుండీ రకుల్ తప్పుకుందని టాక్ వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం… ‘వెంకీ మామ’ చిత్రంలో రకుల్ ప్లేస్ లో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ ను తీసుకున్నారట. దీనికి అసలు కారణం రకుల్ పారితోషికమే కారణమని తెలుస్తుంది. ‘వెంకీ మామ’ చిత్రానికి రకుల్ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అడిగిందట. ఇటీవల రకుల్ నటించిన తెలుగు,తమిళ చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో రెమ్యూనరేషన్ తగ్గించుకోమని నిర్మాత సురేష్ బాబు కోరారట. దీనికి రకుల్ నిరాకరించడంతో…. సురేష్ బాబు నాభా నటేష్ ని ఫైనల్ చేసినట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఇక వెంకటేష్ సరసన ‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారట. ‘కోన ఫిలిం కార్పొరేషన్’ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు ఈ చిత్ర సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus