నైజాంలో రికార్డులన్నిటినీ బద్దలు కొట్టిన గీత గోవిందం

  • September 11, 2018 / 01:18 PM IST

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం మూవీ ఆగస్టు15 న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఐదురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56.25 కోట్ల గ్రాస్ అందుకొని రికార్డు సృష్టించింది. 31.21 కోట్ల షేర్ అందుకుంది. పదిరోజుల్లో ఈ చిత్రం 75 కోట్ల (గ్రాస్) మైలు రాయిని క్రాస్ చేసింది. పదిరోజుల తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ఈసినిమా విడుదలై 26 రోజులవుతున్నా ఇప్పటికి మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 120కోట్ల గ్రాస్ ను, 66.4కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం నైజాం వసూళ్లు స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతుంది.

గీత గోవిందం నైజాం లో 34కోట్ల గ్రాస్ ను 19 .5 కోట్ల షేర్ ని వసూళ్లు చేసి 20కోట్ల క్లబ్ లోకి చేరుకోబోతోంది. నైజాం లో మహేష్, పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, మెగాస్టార్, ప్రభాస్ లకు మాత్రమే టాప్ కలెక్షన్ రికార్డులు వున్నాయి. ఇప్పుడు వీరి సరసన విజయ్ దేవరకొండ చేరుకున్నారు. మరికొన్ని రోజుల్లో వారిని బీట్ చేయనున్నారు. బాహుబలి మినహాయించి మిగతా సినిమాలు 20 కోట్ల షేర్ ని అధిగమించలేకపోయాయి. ఆ ఫీట్ ని ఈ వీకెండ్ నాటికి విజయ్ దేవరకొండ సాధించబోతున్నాడు. దీంతో నైజాంలో నెంబర్ 1 సినిమాగా గీత గోవిందం (నాన్ బాహుబలి రికార్డ్) నిలవనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus