Gopichand: గోపీచంద్ 25వ సినిమా రిజల్ట్ పై స్పందించిన నిర్మాత!

  • March 5, 2024 / 11:06 AM IST

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘భీమా’. గోపీచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్.. లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో ఇదే బ్యానర్లో ‘పంతం’ అనే సినిమా చేశాడు గోపీచంద్. అది గోపీచంద్ కెరీర్ లో 25వ సినిమా. తన ల్యాండ్ మార్క్ మూవీ ఈ బ్యానర్లో చేశాడు కానీ అనుకున్న ఫలితం అయితే దక్కలేదు.

ఈ విషయంపై తాజాగా రాధామోహన్ స్పందించారు. కెకె రాధామోహన్ స్పందిస్తూ.. ‘గోపీచంద్ తన ల్యాండ్ మార్క్ మూవీ, 25 వ సినిమాని మా బ్యానర్లో చేయడం జరిగింది. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ ఆ టైంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల జనాలు థియేటర్ కి రాలేదు. ఆ టాక్ స్ప్రెడ్ అయ్యేలోపే కొత్త సినిమాలు వచ్చాయి, రన్ ముగిసిపోయింది.

అలా ‘పంతం’ ఆశించిన విజయం దక్కించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రముఖ రైటర్ కె.చక్రవర్తి ‘పంతం’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సినిమా బాగానే ఉంటుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ లు కూడా అలరిస్తాయి. కానీ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇక 6 ఏళ్ళ తర్వాత ఇదే బ్యానర్లో గోపీచంద్ (Gopichand) చేసినా ‘భీమా’ వస్తుంది. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus