Pawan Kalyan: హరిహర వీరమల్లు మూవీకి హైలెట్ సీన్ ఇదేనా?

  • September 6, 2022 / 11:21 AM IST

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతుండటంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసినా తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పవర్ గ్లాన్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మూడు రోజుల్లో ఈ వీడియోకు 9.3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బయ్యర్లలో సైతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ కు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉండనుందని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ఈ సీన్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ బంధిపోటు పాత్రలో కనిపిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ సమయంలో హీరోను బంధించి “ఒక్కరు నీకోసం వచ్చినా నిన్ను వదిలేస్తాం” అని చెబుతారు.

మొదట ఒక్కరు కూడా ముందుకు రాకపోయినా ఆ తర్వాత పవన్ కొరకు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతారని సమాచారం అందుతోంది. సినిమాకు హైలెట్ సీన్ ఇదేనని బోగట్టా. మొఘలుల కాలం నాటి ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఎం రత్నం నిర్మాతగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus