అన్నదమ్ములు కలిసి నటించనున్నారా ?

  • February 20, 2018 / 07:47 AM IST

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించి జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిస్ కళ్యాణ్ రామ్, హరికృష్ణ నటిస్తారనే వార్తలు నందమూరి అభిమానులను ఆనందపరిచాయి. అయితే సినిమాలో తండ్రి కొడుకులు కలిసి కనిపించకపోయే సరికి నిరాశపడ్డారు. వారిని సంతోషపెట్టడానికి కళ్యాణ్ రామ్ మరో సినిమాని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో ఎంఎల్ ఏ(మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించింది. ఈ మూవీ మార్చిలో రిలీజ్ కానుంది. దీనితో పాటు కళ్యాణ్ రామ్ జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నారు.

“నా నువ్వే” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేస్తుండడం విశేషం. ఈ మూవీ టీజర్ త్వరలోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత సావిత్రి, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలను దర్శకత్వం చేసిన పవన్ సాదినేని దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ ఫాంటసీ థ్రిల్లర్ చేయబోతున్నారు. ఇందులో తండ్రి హరికృష్ణ తో పాటు, తమ్ముడు ఎన్టీఆర్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ పనులు పూర్తి అయిన వెంటనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus