రూమర్స్ పై స్పందించిన హెబ్బా పటేల్!

  • July 18, 2018 / 11:41 AM IST

స్టార్ మా ఛానల్ వాళ్లు నిర్వహించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ వన్ సూపర్ హిట్ అయింది. గత నెల 10 న “బిగ్‌బాస్‌”  సీజన్‌ 2 మొదలయింది.  హోస్ట్ గా “నేచురల్‌ స్టార్‌” నాని వ్యవహరిస్తున్న షో మంచి రేటింగ్ సాధిస్తోంది. అయితే సీజన్ వన్ కి వచ్చిన రేటింగ్ రావడం లేదు. అందుకే మసాలా పెంచుతున్నారు. డిఫెరెంట్ టాస్క్ లు ఇచ్చి ఆసక్తి కలిగిస్తున్నారు. అంతేకాదు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొంతమందిని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా కుమారి 21 ఎఫ్ అనే సినిమాతో పాపులర్ అయిన హెబ్బా పటేల్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి ప్రయత్నిస్తున్నట్టు కొన్నిరోజులుగా వార్త చక్కర్లు కొట్టింది.

దీనిపై హెబ్బా పటేల్ స్పందించింది. “నేను మా ఇంట్లోనే ఉన్న .. మరే ఇంట్లో లేను .. ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో “బిగ్ బాస్ హౌస్లో”కి హెబ్బా పటేల్ వెళ్లడం లేదని స్పష్టమయింది. హెబ్బా పటేల్ నటించిన తాజా చిత్రం 24 కిసెస్. ఇందులో ఈ హాట్ భామ మెడికల్‌ స్టూడెంట్‌గా.. ప్రొఫెసర్‌తో ప్రేమలో పడే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. మిణుగురు మూవీతో హిట్ కొట్టిన ఆయోధ్య కుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా విజయం పై హెబ్బా కెరీర్ ఆధారపడి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus