స్పైడర్ లో హైలెట్ కానున్న భారీ యాక్షన్ సీన్!

  • July 28, 2017 / 10:24 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న స్పైడర్ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. తమిళ స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దానిని వచ్చే నెల మొదటి వారంలో కంప్లీట్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ఓ సీన్ కోసం 20 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. విలన్ పాత్రదారి అయిన ఎస్. జె సూర్య   రసాయన బాంబ్ తో ఒక పాఠశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడని, ఆయన్ని అడ్డుకోవడానికి మహేష్ శక్తిమేర ప్రయత్నిస్తారని తెలిసింది.

దాదాపు 8 నిమిషాల పాటు సాగే ఈ సీన్ సినిమాలో హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట్లో 80 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ భారీ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ మార్పు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం బడ్జెట్ ను 150 కోట్లకు పెంచారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus