“అరవింద సమేత” శాటిలైట్ హక్కుల కోసం పోటీ!

  • June 18, 2018 / 01:18 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కలక్షన్స్ సినిమాకి సినిమాకి పెరిగిపోతోంది. వరుసగా నాలుగు హిట్స్ అందుకోవడంతో అతని సినిమాలను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే కాదు శాటిలైట్ రైట్స్ కోసం ఛానళ్ల వాళ్లు కూడా పోటీ పడుతున్నారు. తారక్ గత చిత్రం జై లవకుశ సినిమా 14 కోట్లకు అమ్ముడు పోయి.. తన కెరియర్ లోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది. అలాగే టైటిల్ చూస్తే ఫ్యామిలీ చిత్రంలా అనిపిస్తుంటే.. ఫస్ట్ లుక్ మాత్రం యాక్షన్ సినిమాలా మాస్ ప్రేక్షకులను ఊరిస్తోంది.

పూజ హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. సీమ కథలకు నందమూరి హీరోలకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే సినిమా పూర్తికాకముందే శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడుతున్నారు. 15  కోట్లు ఇవ్వడానికి జీ తెలుగు వారు ముందుకు వస్తుంటే.. నిర్మాత రాధా కృష్ణ మాత్రం 20 కోట్ల మీద ఉన్నారు. స్టార్ మా టీవీ వాళ్ళు 16 కోట్లు ఇస్తామన్న ఒప్పుకోవడం లేదు. టీజర్, ట్రైలర్ తర్వాత తమ సినిమా 20 కోట్లకు పైనే ధర పలుకుతుందని నిర్మాత ధీమాగా ఉన్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus