నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్న ‘గీత గోవిందం’ డైరెక్టర్

  • December 12, 2018 / 10:27 AM IST

2018 లో విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు పరశురామ్(బుజ్జి). ఈ చిత్రంతో 100 కోట్ల దర్శకుల లిస్ట్ లో కూడా జాయిన్ అయ్యాడు. నిజానికి పరశురామ్ మంచి రైటర్ అనడంలో సందేహం లేదు. గతంలో వచ్చిన ‘ఆంజనేయులు’ ‘సోలో’ చిత్రాలు ఇప్పటికీ జనాలను అలరిస్తూనే ఉన్నాయి.

అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ పరశురామ్ తో 3 చిత్రాలకు ఆఫర్ ఇచ్చిందంటే తన ప్రతిభ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీత ఆర్ట్స్ బ్యానర్లో తన మొదటి చిత్రం అల్లు శిరీష్ తో చేసి హిట్టు కొట్టాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం తప్ప అల్లు శిరీష్ కు మరో హిట్టు లేకపోవడం గమనార్హం. ఇప్పుడు పరశురామ్ డైరెక్షన్లో చేయడానికి చాలా మంది హీరోలు, నిర్మాతలు ఉత్సాహం చూపిస్థుంచూపిస్తున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం తన తరువాతి చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసాడంట పరశురామ్. ఈ చిత్రం గీతా ఆర్ట్స్ లో కానీ , మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో కానీ తెరకెక్కబోతుంది అని టాక్. ఈ చిత్రంలో నాని లేదా మళ్ళీ విజయ్ దేవకొండ తో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని టాక్. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus