క్రేజీ ధరకు అమ్ముడుపోయిన జై లవకుశ థియేటర్ రైట్స్

  • July 25, 2017 / 09:23 AM IST

వరుసగా హిట్లు.. వైవిధ్యమైన కథ.. నందమూరి అన్నదమ్ముల కలయికలో వస్తున్న తొలి ప్రాజక్ట్  జై లవకుశ. ఈ చిత్రం మొదలయినప్పటి నుంచి అభిమానులను ఊరిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ త్రి పాత్రాభినయం చేస్తుండడం, అందులోను నెగటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేస్తుండడంతో దీనిపై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ రైట్స్ కోసం సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ ని నిర్మాత కళ్యాణ్ రామ్ 70 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కేవలం ఈస్ట్ గోదావరి జిల్లా రైట్స్ మాత్రమే 6.3 కోట్లు పలకడం విశేషం.

ఓవర్ సీస్ రైట్స్ ఇంకా సంప్రదింపుల దశలో ఉంది. ఈ మూవీని కేరళ, తమిళనాడు లోను రిలీజ్ చేయనున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో రైట్స్ 30 కోట్లు పలికే అవకాశముందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. సో ఈ మూవీ రిలీజ్ కి ముందే వందకోట్ల బిజినెస్ చేసి రికార్డు సృష్టించబోతోంది. తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21 న థియేటర్లోకి రానుంది. అప్పుడు ఎన్ని రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus