బాలీవుడ్ క్వీన్ కు భారీ రెమ్యూనరేషన్ అవసరమా..?

  • March 25, 2019 / 04:17 PM IST

కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్ ప్రముఖ నటి, దివంగత ముఖ్యమంత్రి అయిన జయలలిత జీవిత ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ బయోపిక్ లో జయలలిత పాత్ర పోషిస్తుంది. ‘విబ్రీ మీడియా’, విష్ణు ఇందూరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ బయోపిక్ లో నటించడానికి కంగనా రనౌత్ ఏకంగా 24 కోట్లు డిమాండ్ చేసిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే… ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడనికి నిర్మాతలు ఓకే చెప్పేశారట. తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదలచేస్తారట. బాలీవుడ్ లో కంగనా కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే.. తను అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. కంగనాకు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. దీంతో సినిమాకి పెట్టిన డబ్బు ఈజీగా వెనక్కి వచ్చేస్తోందని నిర్మాతలు ధీమాగా ఉన్నారట. జయలలిత లాంటి గొప్ప నాయకురాలి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారట. మరి వారి అంచనాలని కంగనా రనౌత్ ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus