టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న జై లవకుశ

  • August 16, 2017 / 07:07 AM IST

జై లవ కుశ సినిమాని పట్టాలెక్కించడానికి కొంచెం ఆలస్యం అయింది కానీ.. పూర్తి చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ప్రొడక్షన్ వర్క్ మొదలయినప్పటి నుంచి ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోకుండా కష్టపడి టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు పోషిస్తున్నారు. అయినప్పటికీ ఒకే రోజులో మూడు పాత్రల మేకప్ వేసుకోవడానికి, డ్రస్సులు మార్చడానికి ఎన్టీఆర్ వెనుకాడలేదు. మూడు పాత్రల కాంబినేషన్ సీన్ ని చిత్రీకరించేటప్పుడు ఎన్టీఆర్ ఒకే రోజులో 40 జతల డ్రస్సులు వేసుకున్నారు. అంత కష్టపడ్డారు కాబట్టే విజయవంతంగా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ఇంకా రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం.

ఈ విషయాన్నీ అధికారికంగా చిత్ర బృందం రేపు ప్రకటించనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నివేదా థామస్, రాశిఖన్నా, నందిత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్,  లవ ఫస్ట్ లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ‘కుశ’ లుక్ కూడా బయటకు రానుంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus