జై సింహాలో హైలెట్ గా నిలువనున్న అంశాలు

  • January 6, 2018 / 09:59 AM IST

నూరు సినిమాల తర్వాత బాలకృష్ణ నవ యువకుడిగా మారిపోయారు. ఫుల్ జోష్ తో దూసుకు పోతున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమాని అత్యంత వేగంగా పూర్తిచేసి ఔరా అనిపించారు. 101 మూవీ థియేటర్లలో ఉండాగానే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102 వ సినిమాని పట్టాలెక్కించారు. దీనిని కూడా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేశారు. తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో బాలయ్య చేసిన జై సింహా సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 12 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇందులో బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటించారు. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి అభిమానులను అలరించే అంశాలు నిండుగా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా బాలయ్య చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలిసింది. అలాగే అభిమానులను విజిల్స్ వేయించేలా బాలయ్య మార్క్ భారీ డైలాగులు ఉన్నాయని టాక్. ఎమోషనల్ సన్నివేశాల్లో చిరంతన్ భట్ తన సంగీతంతో కం‍టతడి పెట్టించారని చిత్ర బృందం తెలిపింది. ఇందులో బాలకృష్ణ డ్యాన్సులు కూడా బాగా చేశారని స్పష్టం చేసింది. జై సింహ తో మరోసారి బాలకృష్ణ సంక్రాంతి మొనగాడుగా నిరూపించుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus