Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Advertisement

ఒకప్పటి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తెగా సినిమాల్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) అనతి కాలంలోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. బాలీవుడ్లో ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈమె.. టాలీవుడ్లో మాత్రం గ్లామర్ రోల్స్ ఎంపిక చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

Janhvi Kapoor

అలాగే ఇటీవల వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కూడా అచ్చియమ్మ అనే పాత్రలో అందాలు వడ్డించి హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

ఇలా బ్యాక్-టు-బ్యాక్ సక్సెస్‌లతో టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ ‘గోల్డెన్ లెగ్’గా మారిపోయిందనే చెప్పాలి. సక్సెస్ రేట్ పెరిగే కొద్దీ స్టార్స్ డిమాండ్ పెరగడం కూడా మనం చూస్తుంటాం. జాన్వీ  విషయంలోనూ ఇదే జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు.. ‘పెద్ది’ సినిమా కోసం జాన్వీ కపూర్ రూ. 8 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. అంతకు ముందు చేసిన ‘దేవర’ సినిమా కోసం ఈమెకు దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.

అంటే ‘పెద్ది’ సినిమాకి అల్మోస్ట్ 50 శాతం ఎక్కువ పారితోషికం తీసుకుంది జాన్వీ కపూర్ అని మనం అర్దం చేసుకోవచ్చు. ఈ రేంజ్ పారితోషికం ఆమెకు బాలీవుడ్లో కూడా ఆఫర్ చేయడం లేదట. అలా అని పారితోషికం పెంచినా టాలీవుడ్ నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘రాక’ సినిమాలో నటిస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో  ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus