శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో ఎన్టీఆర్ దంపతులు

  • May 2, 2017 / 07:06 AM IST

తెల్ల షర్టు, తెల్ల పంచె కట్టి ఎన్టీఆర్ సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన నిన్న భార్య లక్ష్మి ప్రణతితో కలిసి వెళ్లారు. రాత్రి తిరుమలకు చేరుకున్న ఎన్టీఆర్ దంపతులు శ్రీకృష్ణ అతిధి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఉదయానే శ్రీవారిని దర్శించుకొని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మూడు రోజుల్లో ఈ దంపతులు పెళ్లి రోజు (మే 5 ) ను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఇష్టదైవాన్ని దర్శించుకున్నట్లు తెలిసింది.

వీరిద్దరి వెంట కొరటాల శివ కూడా ఉన్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను తారక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణరామ్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈనెల 6 వ తేదీ నుంచి మూడవ షెడ్యూల్ గుజరాత్ లో మొదలు కానుంది. తమ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి జరుపుకొని ఎన్టీఆర్ గుజరాత్ కి బయలు దేరనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus