అబ్బాయ్ కంటే బాబాయ్ ముద్దంటున్న కాజల్!

  • November 7, 2017 / 12:47 PM IST

“ఓల్డ్ ఈజ్ గోల్డ్” అనే ఇంగ్లీష్ సామెతను మన క్రేజీ హీరోయిన్ కాజల్ కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లుంది. అలా మాకెందుకనిపించిందా అని ఆలోచిస్తున్నారా.. అయితే మా ఈ వివరణాత్మకమైన ఆర్టికల్ ను చదవండి.

విషయం ఏంటంటే.. రామ్ చరణ్ తో మూడు సినిమాల్లో నటించిన తర్వాత పవన్ కళ్యాణ్ సరసన “సర్దార్ గబ్బర్ సింగ్”లో నటించిన కాజల్ ఆ తర్వాత చిరంజీవితోనూ “ఖైదీ నెంబర్ 150″లో నటించిందనుకోండి. అలాగే.. ముందు సుమంత్ సరసన నటించిన తర్వాత నాగచైతన్యతో రొమాన్స్ చేసింది. ఇప్పుడు అదే బాటలో “నేనే రాజు నేనే మంత్రి”లో రాణా ముద్దుల భార్య రాధగా రంజింపజేసిన కాజల్ అగర్వాల్ త్వరలోనే విక్టరీ వెంకటేష్ సరసన నటించేందుకు సన్నద్ధమవుతుందట.

తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కథానాయికగా తొలుత నయనతార పేరు వినిపించినప్పటికీ.. ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో కాజల్ వచ్చి చేరింది. తేజకి కాజల్ తో మాంచి ర్యాపో ఉండడంతోపాటు వెంకటేష్ కూడా ఎప్పట్నుంచో కాజల్ తో సినిమా చేద్దామనుకొంటుండడంతో ఈ కాంబినేషన్ ఇలా సెట్ అయ్యింది. సో, చరణ్ తర్వాత కళ్యాణ్ తో జతకట్టిన కాజల్.. మళ్ళీ రాణాతో రొమాన్స్ తర్వాత వెంకీ సరసన వయ్యారాలు ఒలకబోయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus