ఆ విషయంలో…కాజల్,పూజా హెగ్డే అస్సలు తగ్గట్లేదు..!

  • July 23, 2019 / 06:18 PM IST

సౌత్ లో ఇప్పటికి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. ఇక ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది పూజా హెగ్డే. టాలీవుడ్ లో అయితే ఈమె వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇప్పటికే మహేష్,ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ చిత్రంలో కూడా నటిస్తుంది. సరిగ్గా పదేళ్ళ క్రితం టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కాజల్ లానే ఈమె కెరీర్ కూడా సాగుతుంది. కెరీర్ ప్రారంభంలో కాజల్ ను వరుసగా ప్లాపులు పలకరించాయి. ఆ తరువాత ‘చందమామ’ ‘మగధీర’ చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక పూజా హెగ్డే కు కూడా మొదట్లో ప్లాపులు పలకరించాయి. కానీ ‘డీజే’ చిత్రం నుండీ ఈమె దశ తిరిగింది.

ఇదిలా ఉంటే.. ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ అస్సలు కాంప్రమైజ్ కావట్లేదట. ఈ విషయం అనుకుంటున్నారా? పారితోషికం విషయంలో. ప్రస్తుతం వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ చిత్రం కోసం 1 కోటి 50 లక్షలు తీసుకుందట పూజా హెగ్డే. ఈమె అంటే.. మంచి ఫామ్లో ఉంది కాబట్టి అనుకోవచ్చు. కానీ కాజల్ కూడా అదే తరహాలో ప్రవర్తిస్తుంది. శర్వానంద్ ‘రణరంగం’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కాజల్.. ఆ చిత్రానికి కోటి పైనే పారితోషికం తీసుకుందట. ఇక తాజాగా ‘రాజుగారి గది3’ కోసం కూడా ఆమె కోటిన్నర వరకూ డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆ నిర్మాతలు షాక్ అయ్యి.. కాజల్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇలాగే కొనసాగితే.. స్టార్ హీరోల సినిమాలు పక్కన పెడితే.. కుర్ర హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు కష్టమే..!

1

2

3

4

5

6

7

8

9

10

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus