పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్(Kalki2) కోసం వరల్డ్ వైడ్గా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ను ఫస్ట్ పార్ట్ కంటే మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ మూవీ నైట్ షూట్ షెడ్యూల్కు సంబంధించి ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ తాజా షెడ్యూల్లో డార్లింగ్ ప్రభాస్తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కూడా జాయిన్ కావాల్సి ఉంది.
అయితే సడెన్గా ఈ షూటింగ్కు బ్రేక్ పడింది. దీనికి కారణం.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అనారోగ్యానికి గురికావడమేనని టాక్.ఫస్ట్ పార్ట్లో ఎక్కడా కనిపించని సాయి పల్లవి, ఈ సీక్వెల్లో ఒక పవర్ ఫుల్ రోల్ చేయబోతోందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్లో హైప్ మామూలుగా లేదు. ఇప్పుడు ఆమె హెల్త్ ఇష్యూ వల్ల, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ సెట్స్పైకి వెళ్లాలని నాగ్ అశ్విన్ అండ్ టీమ్ డిసైడ్ అయ్యారట.
దీంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ షెడ్యూల్ను మే నెల మధ్యలో రీ-స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అప్పటికి సాయి పల్లవి కోలుకోవడమే కాకుండా, మిగతా స్టార్ క్యాస్ట్ డేట్స్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు.మరోవైపు ప్రభాస్ డైరీ ఫుల్ బిజీగా ఉంది. ‘కల్కి 2’తో పాటు సందీప్ వంగా ‘స్పిరిట్’, హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘ఫౌజి’ కూడా ఆయన లైనప్లో ఉన్నాయి. మొత్తానికి ‘కల్కి 2’తో ప్రభాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మరోసారి సత్తా చాటడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.